వెంకటాపురం ఎంపీయూపీ పాఠశాల ఉపాధ్యాయిని(స్కూల్ అసిస్టెంట్) డి.సుశీలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు శనివారం కలెక్టర్ పి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు.
రంగంపేట, వి.ఎల్.పురం: వెంకటాపురం ఎంపీయూపీ పాఠశాల ఉపాధ్యాయిని(స్కూల్ అసిస్టెంట్) డి.సుశీలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు శనివారం కలెక్టర్ పి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ‘విద్యార్థులతో కారు కడిగించిన ఉపాధ్యాయురాలు’ శనివారం వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందించి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె విచారణకు ఆదేశించారు. ఎంఈవో కె.శ్రీనివాసరావు, ఎంఈవో-2 మధుసూదనరావు శనివారం పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కారు శుభ్రతతోపాటు ఇతర వ్యక్తిగత పనులు విద్యార్థులతో చేయించారనే అభియోగాలపై దర్యాప్తు చేపట్టి వాస్తవాలను ధ్రువీకరించామని కలెక్టర్ చెప్పారు. నిజనిర్ధారణ తర్వాత నిబంధనలకు లోబడి ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ జిల్లా పాఠశాల విద్యాధికారి ఉత్తర్వులు జారీచేశారన్నారు.