పాక్‌తో యుద్ధం..’నేను సైతం’ అంటూ ఇండియన్ ఆర్మీకి విజయ్ దేవరకొండ సాయం.. ఏం చేశాడో తెలుసా

భారతీయ సైనికుల ధైర్య సాహసాలను సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. పాకిస్తాన్ యొక్క కుతంత్రాలను భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొంటున్న తీరును అభినందిస్తూ, “భారత్ మాతాకీ జై”, “మేము మీతో ఉన్నాము” వంటి ప్రేరణాత్మక సందేశాలు పంచుకుంటున్నారు.


టాలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ భారత సైనికులకు తన సపోర్ట్ తెలిపాడు. తన “రౌడీ బ్రాండ్” అమ్మకాల్లోని ఒక భాగాన్ని సైనికుల కోసం దానం చేస్తానని ప్రకటించాడు. “నాట్ జస్ట్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా” అని హైలైట్ చేస్తూ, “జై హింద్… మీ విజయ్” అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాజమౌళి, రష్మిక మందన్న, శోభిత ధూళిపాళ, ఉపాసన కొణిదెల వంటి ప్రముఖులు కూడా సైనికులకు మద్దతు తెలిపారు. రాజమౌళి, “సైనిక చర్యల ఫోటోలు/వీడియోలు షేర్ చేయకండి, అది శత్రువుకు సహాయపడుతుంది” అని హెచ్చరించారు. రష్మిక మందన్న, “శాంతి కోరుకోవడం అంటే అన్యాయాన్ని సహించడం కాదు” అని స్పష్టం చేశారు.