Viral : కాంచీపురంలో దారుణంగా కొట్టుకున్న పూజారులు

Viral : కాంచీపురంలోని ప్రసిద్ధ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పూజారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల వారు తమను గమనిస్తున్నారనే విషయం కూడా మర్చిపోతారు.
కొట్టుకోవడంలో వారు పూర్తిగా మునిగిపోయారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవ మతంలో ప్రసిద్ధి చెందింది. కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. కాగా, యాత్రలో తొలి పాట పాడడంపై వివాదం తలెత్తింది. అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనను అక్కడ స్థానికులు సెల్ ఫోన్ లో బంధించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *