కసితో ఓటేశాం! మేమేంటో ప్రభుత్వానికి చెప్పే సమయం వచ్చింది: ఉద్యోగులు

కసితో ఓటేశాం!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

» మేమేంటో ప్రభుత్వానికి చెప్పే సమయం వచ్చింది: ఉద్యోగులు

(ఆంధ్రజ్యోతి ): “ఐదేళ్లుగా ఉద్యోగులను చులకనగా చూస్తూ అన్ని విధాలుగా నిర్బంధాలు విధించిన ఈ ప్రభుత్వం గద్దె దిగాలి.. అందుకే కసితో ఓటేశాను. ప్రతి ఉద్యోగీ నాలాగే కసితో ఓటేశారు” అని విశా ఖలోని ఏయూలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం వద్ద ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఆది వారం ప్రారంభమైంది. ఇక్కడ మెజారిటీ ఉద్యోగులు కూటమి అభ్యర్థులకే ఓటేసినట్టు చెప్పారు. ఓటు రూపంలో తమ నిరసన తెలిపామని రిటైర్మెం ట్కు దగ్గరలో ఉన్న ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగులంటే ఏమిటో.. చెప్పే సమయం వచ్చింది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశా’ అని మహిళా ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అవకాశం దొరుకుతుందని టీచర్ ఒకరు ప్రశ్నించారు. తొలిరోజు ఓటేయడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్యూ కట్టారు. మొత్తంగా 5వేల మంది ఓటేశారని ఉపా ధ్యాయ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు వివరించారు.

ఓట్లేయలేం.. మీ నోట్లు మాకొద్దు

ఒంగోలు, న్యూస్టుడే: ప్రకాశం జిల్లాలో ఉద్యోగులు

వైకాపాకు ఓటేసేందుకు ససేమిరా అంటున్నారు. ఒంగోలు నగరం సహా ఇతర నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచే స్తున్నారు. అయినా ఉద్యోగ, ఉపాధ్యాయులు తిరస్కరిస్తు న్నారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం పాఠశాల వద్ద ఒక మహిళా ఉద్యోగిని ఓటు వేసేందుకు వెళ్తుండగా.. సమీ పంలో ఉన్న వైకాపా నాయకులు ఆమెను ఓటు అభ్య ర్థిస్తూ రూ.5 వేలు ఇవ్వబోయారు. ఆ మొత్తాన్ని తిరస్క రించిన ఆమె నేరుగా తెదేపా శిబిరం వద్దకు వచ్చి రూ. పది వేలు అందజేస్తూ ‘ఈ ఎన్నికల్లో ఖర్చులకు వాడండి.. ఇది మీ పార్టీకి నా విరాళం’ అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *