ఉచితంగా రూ.10 లక్షలు ఇస్తోన్న RBI.. ఒక్క పని చేస్తే చాలు.. ఈనెల 17 వరకే ఛాన్స్

www.mannamweb.com


రూ.10 లక్షలు అందుకునే అదిరిపోయే అవకాశం అందుబాటులో ఉంది. ఎలా అని అనుకుంటున్నారా.. మీరు ఎలాంటి ఖర్చు చేయకుండానే ఈ మొత్తాన్ని పొందవచ్చు. దేశీయ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఆఫర్ ప్రకటించింది. 25 ఏళ్లలోపు ఉండే యువతకు క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏకంగా రూ.10 లక్షలు గెలుచుకునే సువర్ణావకాశం. మరిం ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలు తెలుసుకుందాం రండీ.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 వసంతాల వేళ దేశవ్యాప్తంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇస్తోంది. ఈ క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్ 17, 2024 రాత్రి 9 గంటలలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకో వారం రోజులే ఉంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్విజ్ పోటీలు ఉంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్ గురించిన అవగహాన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నాలుగు దశలు ఉంటాయి. తొలుత ఆన్‌లైన్ విధానంలో పోటీలు ఉంటాయి. అందులో టాప్‌లో నిలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జోనల్ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ సైతం ప్రైస్ మనీ ఉంటుంది.

ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఫైనల్ ఉంటుంది. నేషనల్ లెవల్‌లో గెలిచిన మొదటి ముగ్గురికి రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలు ప్రైమ్ మనీ అందస్తారు. జోనల్ స్థాయిలో గెలిచిన ముగ్గురికి రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో మూడు స్థానాలకు రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.1 లక్ష నగదు బహుమతి ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పరీక్షలు ఉంటాయి. 2024, సెప్టెంబర్1వ తేదీ నాటికి 25 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఏదైనా కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://www.rbi90quiz.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు.