ఇంట్లో చేసుకునే చపాతీలు.. లావుగా.. గట్టిగా ఉంటాయి. కానీ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే మాత్రం చాలా మెత్తగా వాటిని తయారు చేసుకోవచ్చు. మెత్తని చపాతీలు తయారు చేయ్యాలంటే.. పిండిని మెత్తగా పిసికి కలుపుకోవాలి. అలా ఎందుకుంటే.. పిండిని సరిగ్గా పిసికి కలుపకపోతే.. చపాతీలు రుచికరంగా ఉండవు. అలాగే చపాతీలు మృదువుగా రావు.
- ఇక చపాతీలు మృదువుగా రావాలంటే.. తొలుత నాణ్యమైన గోధుమ పిండిని ఎంచుకోవాలి. అందులో కల్తీ లేకుండా చూసుకోవాలి. అంటే.. చపాతీ మెత్తగా రావాలంటే.. మంచి నాణ్యమైన గోధుమ పిండిని ఎంపిక చేసుకోవాలి.
- పిండిలో నూనె కలపాలి.. అంటే పిండిని పిసికి కలుపుతున్నప్పుడు కొద్దిగా నూనె కలపాలి. అలా చేయడం వల్ల పిండి మృదువుగా ఉంటుంది. అంతేకాదు.. చపాతీలు మృదువుగా ఉబ్బినట్లుగా తయారవుతాయి.
- పిండిని పిసికి కలుపుతున్నప్పుడు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఎందుకంటే.. చల్లటి నీటిని వాడడం వల్ల పిండి గట్టిగా ఉంటుంది. అందువల్ల.. గోరు వెచ్చని నీటిని వాడడం వల్ల పిండిని మెత్తగా సులభంగా కలుపుకోవచ్చు.
- ఈ పిండిని కలుపుతున్నప్పుడు కొద్ది కొద్దిగా నీటిని అందులో వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి అధికంగా నీటిని కలపడం వల్ల పిండి పల్చబడే అవకాశం ఉంది. ఇక పిండిని గోధుమ పిండిని కలుపుతున్నప్పుడు.. అది మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.
- పిండిని కలిపిన తర్వాత.. కొంత సేపు అలాగే ఉంచాలి. అంటే.. ఈ కలిపిన పిండిని కాసేపు కాటన్ వస్త్రంతో కప్పి ఉంచాలి. ఆ తర్వాత చపాతీలు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా.. మృదువుగా వస్తాయి.
































