వాస్తు నిపుణులు చెప్పినట్లు మందార పువ్వుకు దైవశక్తిని ఆకర్షించే శక్తి ఉంటుంది. ఈ మొక్కను పెంచడం వల్ల ఇంట్లో ఉండే దోషాలు పోతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచితే మంచిదని చెబుతారు.
ఈ రెండు దిశలు అదృష్టాన్ని ఆకర్షిస్తాయని వాస్తులో భావిస్తారు.
మందార పూలు సాధారణంగా పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటికీ చాలా పల్లెటూరి ఇళ్లలో ఇవి నెమ్మదిగా పెరుగుతూ.. ఇంటిని శుభంగా ఉంచే మంచి చిహ్నంగా ఉన్నాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అయితే మొక్క ఎండిపోకుండా తరచుగా నీరు పోస్తూ జాగ్రత్తగా పెంచాలి.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు.. అప్పుల్లో కూరుకుపోయిన వారు ఈ మందార మొక్కను ఇంట్లో పెంచితే దోషాలు తగ్గుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంట్లో డబ్బు నిల్వ చేసే చోట మందార పూలను ఉంచి.. గణపతిని దుర్గాదేవిని ధ్యానిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. ఈ పనిని 7 రోజులపాటు రోజూ చేస్తే డబ్బు సమస్యలు దూరమవుతాయట.
కుటుంబ సంబంధాల్లో గొడవలు, తారసాలు జరుగుతున్నప్పుడు బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మందార పువ్వుతో ఒక పరిష్కారం ఉంది. మీరు నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకునే దిండు కింద ఈ పువ్వును ఉంచి నిద్రపోండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి సంబంధాలను మెరుగుపరుస్తుందని నమ్మకం.
ఇంట్లో శాంతి కోరే వారు రాత్రివేళ రాగి గిన్నెలో నీటితో కలిపి మందార పూలను ఉంచి.. సూర్యోదయం సమయంలో సూర్యుడికి పూజ చేసి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లుకోవచ్చు. ఇది శుభాన్ని పెంచి, చెడు శక్తులను తొలగించడానికి సహాయపడుతుంది.
ఈ విధంగా వాస్తు ప్రకారం మందార మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తిని కలగజేయడమే కాకుండా.. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను తగ్గించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో పచ్చదనం, అందం, మంచి వాతావరణాన్ని తీసుకురావడంలో ఈ మొక్క ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.