Friday, September 20, 2024

Bhakthi: భోగి పండుగ విశిష్టత.. గోదాదేవి కథ..

The specialty of Bhogi festival.. the story of Godadevi..

రేపటి నుండి సంక్రాంతి మొదలవుతుంది. మూడు రోజులు సాగే ముచ్చటైన ఈ పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రజల సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే మకర సంక్రాంతి భోగి పండుతో మొదలవుతుంది అనే విషయం అందరికి సుపరిచితమే.

అయితే భోగి పండుగ జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు దాగి ఉన్నాయి. ఆ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అయితే భట్టనాథుడు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా శ్రీ కృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్దలతో పూజించేవాడు.

దీనితో అక్కడి వారంతా భట్టనాథుడుని విష్ణుచిత్తుడు అని పిలిచే వారు. (విష్ణుచిత్తుడు అంతే విష్ణువును చిత్తశుద్ధితో ఆరాధించేవాడు అని అర్ధం. ) ఇక అయన భక్తి శ్రద్ధలను చూసిన ప్రజలు ఆయనకు పెరియాళ్వారు అనే బిరుదును కూడా ఇచ్చారు. అయితే ఒకసారి ఆ విష్ణుచిత్తుడు తులసి వనం పెంచాలని నిర్ణయించుకుని తోలసి మొక్కలను నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. పిల్లలు లేని తనకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని భావించి ఆ పాపకు కోదై అని పేరుపెట్టి గారాబంగా పెంచుకోసాగాడు. కోదై అంతే తమిళంలో పూలమాల అని అర్ధం. అయితే కోదై అనే పేరు కాలక్రమేణా గోదాగా మారింది.

అయితే చిన్నతనం నుండే శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది గోదా. తన వయసు తో పాటుగా గోదా దేవికి శ్రీకృష్ణుని పై ఉన్న భక్తి పెరిగి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ తనను తాను మరిచిపోయేలా చేసింది.. ప్రస్తుతం తాను నివసిస్తున్న విల్లిపుత్తూరే ఒక్కప్పుడు ఆ బాల గోపాలుని గోపాలం(గోకులం) అని, తన స్నేహితురాళ్లంత గోపికలని, తాను గోపాలుని ప్రేయసిని అనుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ తాయారు చేసే పూల మాలలను మొదటగా తాను ధరించడం మొదలు పెట్టింది.

అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మాలలు మొదటగా తాను ధరించడం చూసిన ఆమె తండ్రి, ఇన్నాళ్లు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూల మాలలను ఆ భవంతునికి ధరిస్తున్ననా అనుకుని.. అపచారం చేశానని భాదపడుతూ నిద్రలోకి జారుకున్న విష్ణుచిత్తుడి కలలో ఆ విష్ణుమూర్తి కనిపించి.. తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని.. ఆమె ధరించిన మాలలను తనకి ధరించడం వల్ల

ఎలాంటి అపచారం జరగదని.. ఇంకా తాను సంతోషిస్తానని చెప్పారు.

ఇలాంటి ఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది. దీనితో తనకు పెళ్లంటూ జరిగితే అది శ్రీకృష్ణునీతో మాత్రమే జరగాలని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలానే తన స్నేహితురాళ్లను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోస్తాహిస్తూ 30 పాశురాలను పాడింది గోదా. ఆ పాశురాలే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపిస్తున్న తిరుప్పావై. ఇక ఆ పరమభక్తురాలు గోదాదేవి భక్తికి, ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరగిపోయాడు.

పాత పెన్షన్ పునరుద్ధరణకు తమ వంతు కృషి చేస్తాం

ఖైరతాబాద్ : వృద్ధాప్యంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంతగానో దోహదపడే పాత పెన్షన్ ను సమిష్టిగా కృషి చేసి పునరుద్ధరించుకుందామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాత పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మల్లు రవి, సాధన సమితి కో-ఆర్డినేటర్ కృష్ణమూర్తి, వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది సుమారు 30 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనే కీలకమని అన్నారు. జీవిత చరమాంకంలో ఓవైపు వృద్ధాప్యం మరోవైపు పెరిగిన ధరలకు అనుగుణంగా రావాల్సిన పెన్షన్ సక్రమంగా రాకపోతే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. కంట్రీబుటరి పెన్షన్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులకు భరోసా ఇవ్వడంలేదని, ఎన్నేళ్లు పనిచేసినా వృద్ధాప్యంలో తమ జీవితాలు ఎలా వెళ్లదీయాలని భయాందోళనకు గురికావాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పాత పెన్షన్ విధానాన్నిప్రవేశపెట్టడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతో భరోసా ఉంటుందని అన్నారు. మల్లు రవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా తమ వంతు కృషి చేస్తామని, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ పాత పెన్షన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ నాయకులు కురుమన్న యాదవ్, సాయిబాబు, స్వామి, బాలచెనయ్య, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్తమ మార్గాలు..

సక్సెస్ ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ, కొన్ని పొరపాట్ల కారణంగా అనుకున్న విజయాన్ని దక్కించుకోడంలో విఫలమవుతారు.
అయితే.. మీ లక్ష్యాలను చేరుకోవాలంటే ఈ మార్గలను అనుసరించండి. సక్సెస్ మీ వెంటే ఉంటుంది.

– జీవితంలో ఏదైన ఒక గోల్, లేదా పనిని ఎంచుకున్నప్పుడు దానిపై స్థిరంగా ఉండగలగాలి.

– మీరు దేనిమీదైతే నైపుణ్యం కలిగి ఉంటారో ఆ దిశగా అడుగులు వేసినట్లయితే సక్సెస్ మీ వెంట ఉంటుంది.

– ఏదైనా చేయగలం అని మీ మీద మీకు నమ్మకం ఉన్నట్లు అయితే విజయం సాధించ గలుగుతారు.

– ఏ వ్యక్తికి అయిన కొన్ని లక్ష్యాలు అవసరం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గోల్స్ పెట్టుకున్న వాళ్లే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు.

– మనం ఒక దారిని ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లే మనోధైర్యం ఉండాలి.
– ఒక పని ప్రారంభించినప్పుడు ఇది అవుతుందా, అవ్వదా అని అనుకోకుండా.. ఓ సవాలుగా పూర్తి చేయగలగాలి.
– నువ్వు ఒక టార్గెట్ అనుకుప్పుడు.. మొదటగా దాన్నే ‘ఎందుకు’ ఎంచుకున్నానని నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. క్లారిటీ వచ్చాకే గోల్స్ నిర్ణయించుకోవాలి.

ఆరోగ్యవంతమైన జీవితం మరియు దీర్ఘాయువు కోసం చాణక్యుడి సూత్రం ఇదే..!

చాణక్యుని నీతిలో ఇటువంటి అనేక సూత్రాలు ఉన్నాయి, వాటిని స్వీకరించి సాధించవచ్చు.
ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు.
మనకు తెలిసినట్లుగా, మంచి ఆరోగ్యం మనిషి యొక్క గొప్ప సంపద. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే, అతను జీవితంలో అన్ని విజయాలు సాధించగలడు. కాబట్టి, మనం ఎల్లప్పుడూ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ రోజుల్లో మనిషి శరీరం వ్యాధులకు నిలయంగా మారింది. మానవులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆరోగ్యం గురించి చాణక్యుడు ఏం చెప్పాడో చూద్దాం.

ఆహారం మరియు నీరు

ఆహారం జీర్ణం కానప్పుడు నీరు తాగడం ఔషధం లాంటిది. ఆహారం జీర్ణమైన అరగంట తర్వాత నీరు తాగడం శరీరానికి మంచిదని భావిస్తారు. భోజనాల మధ్య తక్కువ నీరు త్రాగడం అమృతం లాంటిది. ఇదిలా ఉంటే తిన్న వెంటనే నీళ్లు తాగడం విషం లాంటిది. కాబట్టి మీరు భోజనం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మంచి ఆహారాలు

పొడి ఆహారం కంటే పొడి ఆహారం ఎక్కువ పోషకమైనది. పొడి ధాన్యాల కంటే పాలు 10 రెట్లు ఎక్కువ ప్రయోజనకరమైనవి. ఇంతలో, మాంసం పాలు కంటే 10 రెట్లు ఎక్కువ పోషకమైనది. మాంసం కంటే నెయ్యి 10 రెట్లు ఎక్కువ పోషకమైనది అని చాణక్యుడు చెప్పాడు. ఇవన్నీ మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఈ శరీర భాగం చాలా ముఖ్యమైనది

అన్ని ఆనందాలలో ఆహారం గొప్పది. ఆహారం తీసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కళ్ళు చాలా ముఖ్యమైనవి. అన్ని అవయవాలలో మెదడు చాలా ముఖ్యమైనదని చాణక్యుడు చెప్పాడు.

శరీర మసాజ్

చాణక్యుడు ప్రకారం, మంచి ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన శరీరం కోసం మీరు వారానికి ఒకసారి పూర్తి శరీర మసాజ్ చేయాలి. ఇది రంధ్రాలను తెరుస్తుంది మరియు లోపల ఉన్న మురికి బయటకు వస్తుంది. మసాజ్ తర్వాత మీరు స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధాన్యం వినియోగం

ఆరోగ్యంగా ఉండాలంటే తృణధాన్యాలు తీసుకోవాలి. ధాన్యాలు తినడం వల్ల మనిషి శక్తివంతం అవుతాడు మరియు జీర్ణవ్యవస్థ బలపడుతుంది. బలమైన జీర్ణవ్యవస్థ ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.

పాల వినియోగం

పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. ధాన్యాల కంటే పాలు పదిరెట్లు బలమైనవి. రోజూ పాలు తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. పాలు తీసుకోవడం ఎముకలకు మేలు చేస్తుంది.

నెయ్యి వినియోగం

పాల కంటే నెయ్యి ఎక్కువ మేలు చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా నెయ్యి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోజూ నెయ్యి సేవించాలి.

అరుదైన రికార్డ్.. ఒక్క బంతి కూడా వేయకుండానే వికెట్ తీశాడు

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరిట ఓ అరుదైన ఘనత ఉంది. ఒక బంతి కూడా వేయకుండానే వికెట్ తీసిన ఏకైక బౌలర్‌గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.
2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కోహ్లీ తొలిసారి బౌలింగ్ చేశాడు. వేసిన మొదటి బంతి వైడ్ వెళ్లింది. కానీ బ్యాటర్ పీటర్సన్ ముందుకెళ్లి ఆడే ప్రయత్నంలో భాగంగా క్రీజు దాటగా, వికెట్ కీపర్ ధోని స్టంపింగ్ చేశాడు. దీంతో కోహ్లీ ఒక బంతి కూడా వేయకుండానే వికెట్ తీశాడు.

YS Sharmila: చంద్రబాబుతో భేటీ తర్వాత క్లియర్ కట్‌గా తేల్చి చెప్పేసిన వైఎస్ షర్మిల

టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి.
భేటీ అనంతరం ఏమేం చర్చించారనే విషయాలను వైఎస్ షర్మిల మీడియాకు వెల్లడించారు. ‘ నా కుమారుడు పెళ్లికి ఆహ్వానించాం.. గతంలో నాన్న వైఎస్ ఆహ్వానం మేరకు చంద్రబాబు మా పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వదించారు. నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చాను. వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారు. మాకు.. ఆయనకు రాజకీయ సంబంధాలు లేవు, ఉండవు, ఉండకూడదు, ఉండబోవు. మా మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది’ అని షర్మిల చెప్పుకొచ్చారు. రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించానన్నారు. చంద్రబాబుకు శుభలేఖ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించానే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదు. రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు.
నాన్న గారితో బంధం..!

‘వైఎస్ఆర్‌తో చంద్రబాబుకు ఉన్న స్నేహం, అనుబంధం గురించి ఆయన గుర్తు చేశారు. ఇతర నేతలకు పంపినట్లే.. నారా లోకేశ్‌కు కూడా క్రిస్మస్ కేక్ పంపించాను. కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావుకు కూడా స్వీట్లు పంపాం. అందులో రాజకీయం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తాను. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు. రాజకీయం అనేది మా జీవితం కాదు.. అది మా వృత్తి. ప్రజా పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటాం. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న రాజశేఖరరెడ్డి ఆశయం నిరవేరుతోంది’ అని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. చంద్రబాబుతో భేటీ తర్వాత షర్మిల చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చనీయాంశం అవుతున్నాయి.

ఎంపీ రఘురామ కోసం ఏపీ పోలీసులు వెతుకులాట !

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. దింతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కోసం ఏపీ పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారట.
అట్రాసిటీ కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజును అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం అయిందని సమాచారం అందుతోంది. అరెస్ట్ అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కు బెయిల్ కూడా కష్టమే అని సమాచారం.

దింతో ఢిల్లీలోనే గత కొన్ని నెలలుగా భయంతో రఘురామ మకాం వేసారట. ఎస్టీ, ఎస్టీల గురించి ఇటీవలే నోటికి వచ్చినట్లు మాట్లాడారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు. ఆ తరవాత గుట్టుచప్పుడు కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్‌కి వచ్చి.. మళ్లీ జంప్ అవుతున్నారట. అటు రఘురామని వాడుకుని టీడీపీ – జనసేన కూటమి వదిలేసింది. కాగా అట్రాసిటీ కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజును ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఉదయం 7 గంటలలోపు చేయాల్సిన ఏడు ముఖ్యమైన పనులు..

చాలా మంది నిద్ర లేవగానే చాలా నీరసంగా ఉంటారు. ఏ పని చేయలేరు. అసలు కొంత మందికి అయితే… పొద్దుటే నిద్ర లేచే అలవాటే ఉండదు. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడుతుంటారు.
అయితే.. మార్నింగ్ ఏడు గంటల లోపే లేచి.. ఈ ఏడు పనులు చేసినట్లుయితే మంచి ఆరోగ్యం మీ సొంత అంతుంది.

1. నిద్ర లేవగానే ముందుగా నీరు తాగాలి. దీని ద్వారా రోజంతా ఎంతో తాజాగా ఉంటుంది.

2. లేవడంతోనే ఫోన్, సిస్టమ్, టీవీ చూసే అలవాటు ఉంటే.. ఆ అలవాటును వెంటనే విడిచి పెట్టండి.

3. 20 నిమిషాల పాటు వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరం బలంగా ఉండి రోజంతా యాక్టీవ్‌గా పనులు చేసుకోగలుగుతారు.

4. 10 నిమిషాలు ధ్యానం: ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాబట్టి.. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
5. ప్రార్థన లేదా పుస్తకం చదవడం వంటి మంచి పనులతో మీ రోజును ప్రారంభించండి.

6. మీరు చేయబోయే పనులను ముందే ప్లాన్ చేసుకోండి. దీని వల్ల ఎటువంటి టెన్షన్ లేకుండా మీ పనులు సాఫీగా జరుగుతాయి.
7. చాలా మంది తిన్నాక స్నానం చేస్తారు. అలా చేస్తే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి తినడానికి ముందు స్నానం చేయండి.

Bhogi 2024: భోగీ పండుగ రోజున ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..!

సంక్రాంతి పండుగ వస్తుందంటే.. వారం రోజుల నుంచే ఇంటి పనులు మొదలైపోతాయి. ఇంట్లో అన్ని గదులు శుభ్రం చేసి.. దుమ్మూ, ధూళి దులిపేస్తూంటారు. ఇంకొంత మంది పెయింటింగ్స్ కూడా వేయించుకుంటారు.
ఇలా సంక్రాంతి ఫెస్ట్‌కి ఇంటిని ఎంతో అందంగా రెడీ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ముందు భోగీ పండుగ వస్తుంది. భోగి రోజు.. భోగి మంటను వేసి.. నీళ్లు కాచి తలారా స్నానం చేసి.. కొత్త బట్టలు ధరించి పూజలు చేసుకుంటారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే భోగి పండుగ రోజు.. భోగి పళ్లు పోస్తారు. ఈ సంవత్సరం భోగి పండుల జనవరి 14న వచ్చింది. అయితే భోగి పండుగ రోజు తెలిసీ తెలియక కొంత మంది కొన్ని రకాల పనులు చేస్తూంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యల్ని ఎదుర్కొవాల్సి వస్తుంది. మరి భోగి పండుగ రోజు ఏం చేయకూడదో ఇప్పుడు చూద్దాం.

భోగి రోజు చేయాల్సిన పనులు:
* సనాతన ధర్మంలో అగ్నికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అగ్నిని పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి భోగి రోజు తప్పకుండా అగ్ని దేవుడిని పూజించండి. ఇలా చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.

* అలాగే మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే.. గోధుమలను ఎర్రటి వస్త్రంలో కట్టి అవసరం అయిన వారికి ఇవ్వండి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.

* ఇంటికి దేహీ అంటూ ఎవరు వచ్చినా.. ఉట్టి చేతులతో పంపించకండి. దీని వల్ల మీ ఇంట్లో ఆహారానికి కొదువ ఉండదు.

భోగి రోజు చేయకూడని పనులు:

* భోగి పండుగ రోజు చాలా మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. వీటిని అస్సలు తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
* భోగి పండుగ రోజు నలుపు దుస్తులు ధరించకూడదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట. ఎవరిని కించ పరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడకూడదు.
* భోగి మంటలో ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థాలు వంటివి వేయ కూడదు. కేవలం కట్టెలు మాత్రమే వేయాలి. దీని వల్ల గాలి కలుషితం కాకుండా ఉంటుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

Eat Too Much Salt: ఉప్పును అతిగా తీసుకునేవారు తస్మాత్‌ జాగ్రత్త..ఎందుకంటే..

Eat Too Much Salt What Happens: ఉప్పు ఆహారాలకు రుచిని అందించేందుకు సహాయపడుతుంది. ఉప్పులేని చప్పిడి గల ఆహారాలు తినడం చాలా కష్టం..అయితే ప్రస్తుతం చాలా మంది ఉప్పును అతిగా వినియోగిస్తున్నారు.
ఇలాంటి వారు తప్పకుండా ఉప్పు గురించి పలు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉప్పును అతిగా ఆహారాల్లో వినియోగించడం వల్ల అనేక రకాల హానికరమైన వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో దీని కారణంగానే చిన్న వయసులో రక్తపోటు సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు గుండె, మూత్రపిండాల వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే వ్యాధులు రావడానికి ఉప్పు ఎలా కారణమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉప్పు అతిగా వినియోగిస్తే కిడ్నీ సమస్యలు తప్పవా?
అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధులు వస్తూ ఉంటాయి. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు (CKD) కూడా వస్తున్నాయి. కాబట్టి ఉప్పును అతిగా వినియోగించుకునేవారు
తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

కిడ్నీ పేషెంట్స్‌ ఏ ఉప్పు తినాలో తెలుసుకోండి:
కిడ్నీ పేషెంట్స్‌ తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిపితో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉప్పు కలిపిన ఆహారాలు తీసుకుంటే వ్యాధి తీవ్ర 29% పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ఉప్పుకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు ఎందుకు హానికరం:
ఉప్పులోని ప్రధాన ఖనిజాలలో సోడియం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి దీనిని అతిగా తీసుకోవడం వల్ల కండరాల సంకోచం, నరాలలో సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా కొంతమందిలో కండరాల బలహీనత సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఉప్పును అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Relationship : భార్యతో రొమాంటిక్ రిలేషన్ బాగుండాలంటే ఈ 5 సూత్రాలు పాటించాలి.

Relationship : భార్యభర్తల బంధం శాశ్వతమనది. ఒక్కసారి ఏడడుగులు నడిచిన తరువాత జీవితాంతం కట్టుకున్న వ్యక్తితోనే గడపాల్సి ఉంటుంది. అయితే నేటి కాలంలో భార్యభర్తల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వల్ల పెళ్లయిన కొద్ది కాలానికే దూరమవుతున్నారు.
ఒకప్పుడు పెళ్లిళ్లు చేసుకున్న వారు సాంప్రదాయ కట్టుబాట్లతో రిలేషన్ షిప్ ను శాశ్వతంగా మెయింటేన్ చేసేవారు. కాలం మారుతున్న కొద్దీ భార్యభర్తల మధ్య ఉన్న అనుబంధం తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. పెళ్లయిన దంపతుల్లో భార్యభర్తలు ఇద్దరూ సమానమే. అయితే రొమాంటిక్ లైఫ్ విషయానికొచ్చేసరికి భర్తపై భార్య మనసు పడాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. వీటి ద్వారా తమ భాగస్వామిని ఆకట్టుకోగలగాలి. ఇంతకీ ఆ సూత్రాలేంటంటే?

గౌరవం:
ఒక వ్యక్తిని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను.. అని చాలా మంది అంటుంటారు. అందుకు ఆ వ్యక్తి రూపం, అందం అని కొందరు అంటుంటారు. కానీ ఆ వ్యక్తి ప్రవర్తనే అసలైన కారణం. ఇతరులతో ఆ వ్యక్తి ఎలా నడుచుకుంటున్నాడు? మర్యాదగా ప్రవర్తిస్తున్నాడా? దయా గుణం ఉంటుందా? అనే విషయాలు ప్రతి భార్య తన భర్తలో చూస్తుంది. ఈ లక్షణం ఉన్న భర్తను ఎక్కువగా ఇష్టపడుతుంది. అందంగా, ఆకర్షణీయంగా లేకపోయినా ఇలాంటి లక్షణం ఉంటే ఎక్కువ ప్రేమ చూపుతుంది.

సున్నితం.. ఆధిపత్యం:
భార్యభర్తల మధ్య ప్రేమానుబంధాలు ఉన్నప్పుడే వారి జీవితం బాగుంటుంది. ముఖ్యంగా భార్యపై సున్నిత మనస్తత్వం ఉండాలి. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏదైనా సమస్య వస్తే చికాకు పడకుండా వాటి పరిష్కారానికి కృషి చేయాలి. అందమైన మాటలు మాట్లాడాలి. కొందరు మహిళలు చాలా సున్నితంగా ఉంటారు. అయితే భర్తలు రాష్ గా బిహేవియర్ చేయడంతో వారు లోలోలపల మదనపడుతూ ఉంటారు. ఇదే సమయంలో ఒక్కోసార ఆధిపత్యం చెలాయించే గుణం కూడా ఉండాలి. ఎందుకంటే భార్య చేసే కొన్ని తప్పులు చూపిస్తూ వారిని సక్రమమైన మార్గంలో నడిపించగలిగాలి. అప్పుడు తన భర్తపై నమ్మకం పెరుగుతుంది.
ఎదుటివారిని అర్థం చేసుకునే మనస్తత్వం:
భాగస్వామి విషయంలో కొందరు పురుషులు నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా కొందరు భర్తలు తమ భార్య ఏం చెప్పినా పెద్దగా పట్టించుకోరు. పైగా వారిని హేళన చేస్తారు. ఇలాంటి వారిని దూరంగా పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారు ఏం చెబుతున్నారో కాస్త ఓపిగ్గా విని ఆ తరువాత వారి పనులు చేయగలిగితే భర్తపై అధికమైన ప్రేమ చూపుతారు. దీంతో భార్యభర్తల మధ్య రొమాంటిక్ రిలేషన్ బలంగా మారుతుంది.

ఇంట్లో తోడుగా..
చాలా మంది మహిళలు భర్తలు విధుల్లోకి వెళ్లి వచ్చిన తరువాత వారిని డిస్ట్రబ్ చేయరు. కానీ వారి నుంచి అమితమైన ప్రేమను పొందేందుకు వారి పనులు చేయగలిగాలి. ఉదాహరణకు వంట గదిలో లేదా ఇంట్లో కొన్ని పనులు వారికి సాయంగా ఉంటూ చేయగలిగాలి. ఇలా చేయడం వల్ల మీ వెంటే జీవితాంతం అనే భావన కలుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగంలో ఏదైనా సమస్యలు వచ్చిన సమయంలో వారు మీకు తోడుండడానికి ప్రయత్నిస్తారు.

అన్ని విషయాల్లో కలుపుగోలుగా..
భర్తలు కొన్ని బయట జరిగే విషయాలు భార్యలతో చెప్పలేరు. కానీ తమ పర్సనల్ విషయాలను చెప్పుకోగలగాలి. లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పబోతే వారు పట్టించుకోరు. అన్ని విషయాల్లో కలుపుగోలుగా ఉండగలిగితే వారు మీపై ఎక్కువ ప్రేమ చూపుతారు. దీంతో ప్రేమానుబంధాలు పెరుగుతాయి.

పొట్ట కారణంగా ఇష్టమైన దుస్తులను ధరించలేకపోతున్నారా.. అయితే వెంటనే పొట్ట కరిగించే డ్రింక్ మీకోసమే..

ఈ మధ్య కాలంలో చాలామందికి వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే ఇలా బెల్లీ ఫ్యాట్( Belly fat ) అనేది కనిపిస్తోంది. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లు దీనికి కారణం అని చెప్పవచ్చు.
అలాగే శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తినకపోవడం, లాంటివి ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఇలాంటి విషయాలు తెలిసిన సరే ఎవరు కూడా పెద్దగా పాటించరు. ఇక పొట్ట కారణంగా ఇష్టంగా బ్రతకలేక బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు తమకు ఇష్టమైన దుస్తులను కూడా ధరించలేక పోతారు.

ఈ విధంగా చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు ఈ డ్రింక్ తీసుకుంటే కచ్చితంగా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీలకర్ర( cumin ) అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని రోజు మనం పోపులో వేస్తూ ఉంటాం. అయితే ఇది బరువు తగ్గేందుకు, బెల్లీ ఫ్యాట్ ను కరిగించేందుకు కూడా మంచి ఔషధం అని చెప్పవచ్చు. పొట్టను కరిగించేందుకు రాత్రిపూట జీలకర్ర నీటిని తాగడం మంచిది. ఇక అల్లం టీ ( Ginger tea )కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఉన్న ఉపయోగాల గురించి చాలామందికి తెలిసి ఉండదు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంతోపాటు బెల్లీ ఫ్యాట్ ను కూడా కరిగిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత దీన్ని తాగడం మంచిది. క్యారెట్ జ్యూస్( Carrot juice ) కూడా పొట్టను తగ్గిస్తుందని చాలామందికి తెలిసి ఉండదు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ కొవ్వును కరిగించేందుకు బాగా సహాయం చేస్తుంది. చాలామందికి పుచ్చకాయ జ్యూస్ తో కలిగే ప్రయోజనాల గురించి కూడా పెద్దగా తెలిసి ఉండదు. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో 90% నీరు ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉంటుంది. కాబట్టి ఫ్యాట్ ను కరిగించడంలో కీలకంగా పనిచేస్తుంది.
ఇక గోరువెచ్చని నీటిలో, నిమ్మకాయ రసం వేసి కలుపుకొని తాగడం చాలా మంచిది. అలాగే ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ లో చియాసిడ్ ను జోడించి తాగడం వలన ఆకలిని తగ్గించి బెల్లి ఫ్యాట్ కరగడం ఖాయం. కాబట్టి రాత్రిపూట ఈ డ్రింక్స్ ను తాగడం వలన బెల్లీ ఫ్యాట్ వెంటనే తగ్గిపోతుంది.

India Map: ఇండియా మ్యాప్‌లో శ్రీలంకను ఎందుకు చూపిస్తారో తెలుసా..?

India Map: మనం చిన్నప్పటి నుంచి ఇండియా మ్యాప్‌ చూస్తున్నాం. మన మ్యాప్‌లో కిందభాగంలో శ్రీలంక దేశం కూడా కనిపిస్తుంది. మనది వేరే దేశం.. శ్రీలంకది వేరే దేశం అయినా..
భారత మ్యాప్‌లో మాత్రం శ్రీలంక కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ దేశమైనా దాని సరిహద్దుల ఆధారంగా మ్యాప్‌ను రూపొందిస్తారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాగే తమ భౌగోళిక మ్యాప్‌ను పొందుపరుస్తాయి. కానీ, ఒక్క భారత మ్యాప్‌లో మాత్రమే మన భూగోళంలో పక్కనే ఉన్న శ్రీలంక దేశాన్ని కూడా చూపిస్తుంది.

ఎందుకు ఇలా..?
ఒక దేశం మ్యాప్‌ను మరో దేశం మ్యాప్‌లో మనం ఎప్పుడూ చూసి ఉండం. మన సరిహద్దు దేశాలైనా పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్‌ కూడా ఉన్నాయి. కానీ ఇవేవీ భారత మ్యాప్‌లో కనిపించవు. కానీ శ్రీలంక మాత్రం మన మ్యాప్‌లో కనిపిస్తుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక దేశం మ్యాప్‌లో మరో దేశం చూపించడం నేరం. కానీ, భారత దేశ మ్యాప్‌లో శ్రీలంకను చూపినా అది నేరంగా పరిగణించడం లేదు. దీనికి ఓ కారణం ఉంది. అయితే ఆ కారణం చాలా మందికి తెలియదు.
సముద్ర చట్టం ప్రకారం..
సముద్ర చట్టం ప్రకారం.. ఒక దేశ సరిహద్దులో ఉన్న సముద్ర ప్రాంతాన్ని కూడా ఆ దేశం మ్యాప్‌లో చూపించాలి. దీనిని ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదించింది. సరిహద్దున ఉన్న సముద్రంలో 200 నాటికల్‌ మైల్స్‌ వరకు అంటే 370 కిలోమీటర్ల సముద్రమట్టం మ్యాప్‌లో చూపించాలి. ఈ చట్టం ప్రకారం.. మన దేశం 370 కిలోమీటర్ల సరిహద్దును చూపుతుంది. అందుకే మన మ్యాప్‌లో శ్రీలంక కూడా వస్తుంది. భారతదేశంలోని తమిళనాడు రామేశ్వరం నుంచి శ్రీలంక కేవలం 18 నాటికల్‌ మైల్స్‌ మాత్రమే ఉంటుంది. అంటే 54.8 కిలోమీటర్లు మాత్రమే. అందుకే మ్యాప్‌లో ఇండియా కచ్చితంగా శ్రీలంకను చూపించాల్సిన పరిస్థితి.

మీ వ్యాపారం పై చెడు దృష్టి పడిందా.. అయితే ఇలా చేయండి..

నరదృష్టి గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం.. ఒకరి ఇంటి పైన నరదృష్టి పడితే ఆ ఇంటిలో అశాంతి, వ్యాపారంలో నష్టం వాటిల్లుతుందని నమ్ముతుంటారు.
దృష్టి గురించి తెలుసుకునే ముందు మన చుట్టూ అనేక రకాల శక్తులు సంచరిస్తుంటాయి. ఈ శక్తి సానుకూలంగా, ప్రతికూలంగా ఉంటాయి. మనిషి సానుకూల శక్తితో జీవించినంత కాలం సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. కానీ ఏదైనా ప్రతికూల శక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో అంతా గందరగోళంగా ఉంటుంది, దాన్నే చెడు కన్ను అంటారు. ఈ ప్రతికూల శక్తి ఒక వ్యక్తి ప్రవర్తన, ఆలోచనల నుండి ఉద్భవిస్తుందని పండితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు.

ప్రతికూల శక్తి ప్రభావాన్ని కుటుంబంలో సమస్యలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టాలు రావడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు చెడు కన్ను కారణంగా, పగలు, రాత్రి ఇంటిలో అపశ్రుతులు, అశాంతి నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలకు గురవుతారని చెబుతున్నారు.

ఈ రెమెడీస్‌ని పాటించడం ద్వారా నరదృష్టి నుంచి బయటపడొచ్చు..

కొంతమంది చెడు దృష్టి ప్రభావాన్ని త్వరగా తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలను చూసుకుంటారు. మరి ఆ పరిష్కార మార్గాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏదైనా దుష్టశక్తి వ్యాపారాల పై, కుటుంబాల పై పడితే నల్ల గుడ్డలో పటికను కట్టి తలుపుకు వేలాడదీయండి.

శనివారం రోజు రెండు నిమ్మకాయలు, ఏడు పచ్చి మిరపకాయలు కట్టి మీ షాపులో, ఆఫీసులో, షోరూంలో లేదా మరేదైనా వ్యాపార స్థలంలో వేలాడదీయండి.
నిమ్మకాయ, మిరపకాయలను ప్రతి ఒక్కరూ చూడగలిగే ప్రదేశంలో పెట్టాలని గుర్తుంచుకోండి.
ప్రతి శనివారం ఈ నిమ్మకాయ, మిరపకాయలు మారుస్తూ ఉండండి.

ఎండుమిర్చి, ఆవాలు 7 సార్లు వ్యాపార స్థలంలో తిప్పి వాటిని మంటలో వేసి కాల్చండి.
ఇలా చేయడం ద్వారా మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.

Amazon Sale: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. రూ. 10 వేల లోపు బెస్ట్‌ ఫోన్స్‌ ఇవే

లావా బ్లేజ్‌​ 5జీ ఫోన్‌ 4 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో కొనుగోలు అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర రూ.16,999 కాగా ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌లో రూ.9999కు అందుబాటులో ఉంది.

ఈ ధరకు అదనంగా బ్యాంకు ఆఫర్లను పొందవచ్చు. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్‌ మధ్యతరగతి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అప్పో ఏ 18 4 జీబీ + 64 జీబీ, 4జీబీ + 128 జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌లో 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ 6.56 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో 720×1612 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13తో పని చేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. ఈ ఫోన్‌ వాస్తవ ధర రూ.14,999. అయితే ఈ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.10000కే సొంతం చేసుకోవచ్చు.

పోకో సీ 55 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ 6.71 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియా టెక్‌ హీలియో జీ 85 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌ ఈ సేల్‌లో రూ.6499కు కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌ మీ 13సీ తక్కువ ధరకు వచ్చే 5జీ ఫోన్‌గా ప్రజాదరణ పొందింది. ఈ ఫోన్‌ 4 జీబీ +128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌ ఈ సేల్‌లో కేవలం రూ.7999కు సొంతం చేసుకోవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 18 వాట్స్‌ ఫాస్ట్‌ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

రియల్‌మీ నార్జో ఎన్‌ 55 ఫోన్‌ 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌లో లభ్యం అవుతుంది. ఈ ఫోన్ 90 హెచ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13తో పని చేసే ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. ఈ ఫోన్‌ను ఈ సేల్‌లో కేవలం రూ.9499కే సొంతం చేసుకోవచ్చు

Big Breaking: వైసీపీకి మరో బిగ్ షాక్.. మచిలీపట్నం ఎంపీ రాజీనామా

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం నుంచి ఎంపీగా ఉన్నారు. వైసీపీ ఇంఛార్జుల మార్పులతో మరోసారి సీటు దక్కడం కష్టమని భావించిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఎంపీ బాలశౌలి వైఎస్ జగన్‌కు సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని సీఎం జగన్ స్పష్టత ఇవ్వకపోవడంతో బాలశౌలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో వైసీపీ నాలుగో లిస్టు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎంపీ బాలశౌరి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులను వైసీసీ అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీ బాలశౌరి రాజీనామాతో ఆ స్థానంలో ఎవరి పేరు ఉండబోతుందో చూడాలి. మరోవైపు ఎంపీ బాలశౌరి రాజీనామాతో మచిలీపట్నం వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?

CM Jagan : ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. ఇందుకోసం అవసరమైన వ్యూహాలు రచిస్తూ పలు కీలక మార్పులు చేపడుతున్నారు.
వై నాట్ 175 అంటున్న జగన్.. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. ఇటు పార్లమెంట్, అటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటివరకు ఇంఛార్జిల మార్పు పేరిటి మూడు జాబితాలు విడుదల చేశారు సీఎం జగన్. వీలైనంతవరకు అసంతృప్తులను బుజ్జగిస్తూ మార్పులు చేర్పులు చేపడుతున్నారు.

ఇక రాజకీయ సామాజిక సమీకరణాలతో పాటు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ ఎంపిక ప్రక్రియ చేపడుతోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 59 చోట్ల ఇంఛార్జిలను మార్చారు. ఇందులో 9 ఎంపీ స్థానాలు, 50 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలనే పట్టుదలతో ఉన్న జగన్ చాలా చోట్ల అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇప్పటివరకు 23 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కూడా నిరాకరించారు. ఆయా స్థానాల్లో కొత్త వారిని సైతం ప్రకటించారు. మరోవైపు మూడు ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థులను మార్చారు జగన్.

ఓవరాల్ గా 23 సిట్టింగ్ లను పూర్తిగా పక్కన పెట్టేశారు. వారికి స్థాన చలనం లేదు. టికెట్లు కూడా కేటాయించలేదు. ఓవరాల్ గా ఈ మూడు జాబితాలను చూస్తే.. 23మంది సిట్టింగ్ లకు సీట్లు గల్లంతయ్యాయి. అలాగే ఎంపీలకు సంబంధించి కొన్ని చోట్ల అదే తరహా వాతావరణం ఉంది. ఎందుకిలా జరిగింది? సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మార్పు వెనుక మర్మం ఏంటి?

Do you have Rs.500 notes with a star symbol?.. But you must know this!

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ బెడద ఎక్కువై పోయింది. వాస్తవాలకు విరుద్ధంగా జరుగుతున్న ఎన్నో ప్రచారాలు జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఇటీవల ఇలాంటిదే ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే నక్షత్రం (*) గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవని దేశంలోని పలు చోట్ల జోరుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు వాట్సప్ సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఇంకేముందీ చాలా మంది బ్యాంకులకు వెళ్లి మరీ ఈ నోట్లు తిరిగిచ్చేస్తున్నారని ప్రచారం చేశారు. ఈ ప్రచారమంతా నిజమేనేమో అని నమ్మేట్టుగా ఎక్స్ వేదికగా కూడా విస్తృత ప్రచారం జరిగింది. ‘ స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయి. ఇలాంటి నోటు ఒకటి నా దగ్గరకు కూడా వచ్చింది. అది నకిలీ నోటు. ఈ రోజు నా స్నేహితుడు వద్దకు ఓ కస్టమర్ నుంచి ఇలాంటివి 2-3 నోట్లు వచ్చాయి. శ్రద్ధగా పరిశీలించి వాటిని వెనక్కి తిరిగిచ్చేశాడు” అని పేర్కొన్నాడు.
అయితే ఈ ప్రచారమంతా నకిలీదేనని తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం నక్షత్రం (*) గుర్తు ఉన్న నోటుని ఒక నోటు స్థానంలో మరో దాన్ని ముద్రించారని లేదా పున:ముద్రించారని అర్థంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ పీఐబీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 2016 నుంచి స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు చెలామణిలో ఉన్నాయని తెలిపింది. 2016 నాటి ఆర్‌బీఐ సర్క్యూలర్‌ను కూడా జోడించింది. ట్వీట్ ద్వారా ఈ క్లారిటీ ఇచ్చింది. దీంతో స్టార్ గుర్తు ఉన్న నోట్లు నిజమైనవేనని నిర్ధారణ అయ్యింది.

మీ సెక్స్ లైఫ్ హెల్తీ గా..రొమాంటిక్ గా ఉండాలంటే ఈ విటమిన్లు చాలా అవసరం..

నేటి కాలంలో కూడా లైంగిక సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడరు. దీనికి సంబంధించిన అనేక అపోహలు నేటికీ నిజమని భావించబడుతున్నాయి. లైంగిక జీవితానికి సంబంధించిన సరైన సమాచారం కూడా చాలా ముఖ్యం.
మన ఆహారపు అలవాట్లు మరియు దినచర్య మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, అదే విధంగా ఆహారం మన లైంగిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల బలహీనత, అలసట మరియు ఇన్ఫెక్షన్‌లతో సహా అనేక సమస్యలు వస్తాయి. అదేవిధంగా, శరీరంలోని కొన్ని విటమిన్ల లోపం మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దీని గురించి నిపుణుల నుండి కొంత సమాచారాన్ని మీ కోసం.

వయసు పెరిగే కొద్దీ సెక్స్ పై ఆసక్తి లేకపోవటం సహజమే, కానీ ఈ రోజుల్లో స్త్రీలలో వయస్సు రాకముందే సెక్స్ కోరిక తగ్గడం మొదలవుతుంది. దీనికి కారణం ఎల్లప్పుడూ సంబంధంలో ఉండే గ్యాప్ లేదా టెన్షన్ కాదు. మీ మొత్తం ఆరోగ్యం వలె, మీ లైంగిక ఆరోగ్యం మరియు లిబిడో కూడా మీ ఆహారం మరియు జీవనశైలి ద్వారా ప్రభావితమవుతాయి. శారీరక అస్థిరత, ధూమపానం నుండి శరీరంలో పోషకాల లోపం వరకు లిబిడో లోపానికి కారణం కావచ్చు. ఈరోజు మేము ఇక్కడ, లిబిడో (సెక్స్ కోసం పోషకాలు) పెంచడం ద్వారా మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్‌ల గురించి తెయజేస్తున్నాముం.

 

జంటలు సెక్స్ పై ఆసక్తి పెంచడానికి అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు, కానీ అన్నిటికీ ముందు మీ శరీర పోషక అవసరాలను తీర్చడం ముఖ్యం. మీ లిబిడోను పెంచే కొన్ని ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. ఇది రక్త ప్రవాహాన్ని పెంచేటప్పుడు మీ శరీరంలో ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.

ఈ 8 ముఖ్యమైన పోషకాలు లిబిడోను పెంచడం ద్వారా లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి

విటమిన్ ఎ

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, విటమిన్ ఎ అధికంగా ఉండే గుడ్లు, పాలు, మాంసం, నారింజ లేదా పసుపు పండ్లు మరియు కూరగాయలు టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడతాయి. టెస్టోస్టెరాన్ ఒక ముఖ్యమైన సెక్స్ హార్మోన్. “విటమిన్ ఎ మగ మరియు ఆడ సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. మహిళల్లో సాధారణ పునరుత్పత్తి చక్రం కోసం ఇది తగినంత పరిమాణంలో కలిగి ఉండటం కూడా అవసరం. విటమిన్ ఎ పురుషులలో ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

విటమిన్ బి12

విటమిన్ బి12 స్పెర్మ్ కౌంట్ పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది స్పెర్మ్ DNA దెబ్బతినడాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో కొన్ని విటమిన్లు ఉన్నాయి, వాటి లోపం కారణంగా ఒక వ్యక్తి లైంగిక సంబంధాలు కలిగి ఉండటానికి తక్కువ కోరికను కలిగి ఉంటాడు. వాటిలో విటమిన్ బి12 ఒకటి. దాని స్థాయి తగ్గినప్పుడు, లైంగిక సంబంధాలు కలిగి ఉండాలనే మీ కోరిక మసకబారడం ప్రారంభమవుతుంది.

విటమిన్ B3

విటమిన్ B3 ఒక సంక్లిష్టమైన విటమిన్, ఇది జీర్ణక్రియ మరియు బలానికి అలాగే లైంగిక జీవితానికి అవసరం. ఇది లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. అడ్రినల్ గ్రంథిలో లైంగిక సంబంధాలకు అవసరమైన హార్మోన్ల ఉత్పత్తిలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా, ఈ విటమిన్ పురుషులకు చాలా ముఖ్యమైనది.

విటమిన్ సి

విటమిన్ సి తరచుగా రోగనిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే బాధ్యత వహిస్తుంది. కానీ లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లైంగిక కోరికలను పెంచడంలో లేదా తగ్గించడంలో ఈ విటమిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది స్పెర్మ్ కౌంట్ పెంచడంలో కూడా సహాయపడుతుంది.
విటమిన్ డి

విటమిన్ డి ఎముక మరియు శరీర బలానికి అలాగే లైంగిక ఆరోగ్యానికి బాధ్యత వహిస్తుంది. విటమిన్ డి విటమిన్ మరియు హార్మోన్ రెండూ. ముఖ్యంగా పురుషుల్లో విటమిన్ డి లోపం అంగస్తంభనపై ప్రభావం చూపుతుంది. సెక్స్ హార్మోన్లకు విటమిన్ డి సప్లిమెంట్లు ముఖ్యమైనవి.

విటమిన్ కె

లైంగిక పనితీరును మెరుగుపరచడంలో విటమిన్ కె ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లిబిడోను మెరుగుపరుస్తుంది మరియు లైంగిక శక్తి మరియు కోరికకు అవసరం.

మెగ్నీషియం

శరీరంలో మెగ్నీషియం తగినంత మొత్తంలో ఉండటం వల్ల మంచి నిద్ర వస్తుంది. పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం, సెక్స్ డ్రైవ్‌కు ఇది చాలా ముఖ్యం. డ్రై ఫ్రూట్స్, గింజలు, గుడ్లు, తృణధాన్యాలు, బ్రౌన్ రైస్ మరియు ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు మెగ్నీషియం యొక్క మంచి వనరులు.

సెలీనియం

బ్రెజిల్ గింజలు సెలీనియం యొక్క మంచి మూలం. బ్రెజిల్ గింజల ముక్కను రోజూ తీసుకోవడం వల్ల మీ లిబిడో పెరుగుతుంది. పబ్మెడ్ సెంట్రల్ ప్రకారం, ఇది బ్రోకలీ, క్యాబేజీ, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, తృణధాన్యాలు మరియు సముద్రపు ఆహారంలో కూడా కనిపిస్తుంది.

జింక్

పప్పులు, తృణధాన్యాలు, గుడ్లు, సీఫుడ్, రెడ్ మీట్ మరియు చీజ్‌లలో ఉండే జింక్ కూడా మీ మొత్తం ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం. “జింక్ లోపం వంధ్యత్వానికి కారణమవుతుంది. జింక్ లోపం లిబిడోపై గణనీయమైన ప్రభావాన్ని చూపనప్పటికీ, వంధ్యత్వం మీ లిబిడో తగ్గడానికి కారణమవుతుంది. అందువల్ల, మీ ఆహారంలో తగినంత మొత్తంలో జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి.
కాల్షియం

కాల్షియం ఎముకలకు మంచిది, కానీ ఇది మీ లైంగిక ఆరోగ్యానికి కూడా గొప్పది. పాలు, పెరుగు, నారింజ మరియు జున్నులో తగినంత మొత్తంలో కాల్షియం ఉంటుంది.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, కాల్షియం లోపం పొందికకు ఆటంకం కలిగిస్తుంది. దాని లోపం కారణంగా వ్యక్తి మరింత చిరాకుగా ఉంటాడు. కాల్షియం లోపం వల్ల కలిగే శారీరక మరియు మానసిక సమస్యలు స్వయంచాలకంగా సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తాయి.

ఇనుము

మీ లైంగిక ప్రేరేపణ స్థాయిలను నిర్వహించడంలో ఇనుము ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఎర్ర మాంసం, గుడ్డు పచ్చసొన, ఆకుపచ్చ కూరగాయలు మరియు డ్రై ఫ్రూట్స్‌లో లభిస్తుంది. పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం, ఇనుము లోపం కూడా అంగస్తంభనకు దోహదం చేస్తుంది.

గుర్తుంచుకోవాలి

అవసరమైన పోషకాహారం మొత్తం ఆరోగ్యానికి ఆధారం. కానీ దీనితో పాటు, మీరు ఒత్తిడి లేకుండా మరియు మీ సంబంధాలను మధురంగా ​​ఉంచుకోవడం కూడా ముఖ్యం. మీరు మీ దినచర్య మరియు సంబంధాలను మెరుగుపరుచుకోని పక్షంలో ఏ విటమిన్ లేదా మినరల్ కూడా మీకు ప్రయోజనకరంగా ఉండదు.

క్షణాల్లో పర్సనల్‌ లోన్‌ మీ సొంతం.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వ్యక్తిగత రుణాలు దేశంలో గృహ రుణాల తర్వాత అత్యంత సాధారణంగా లభించే రెండవ రకం రుణంగా ర్యాంక్ పొందాయి. బ్యాంకులు తక్షణమే వ్యక్తిగత రుణాలను అందిస్తాయి, తరచుగా అధిక-వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి.
అయితే వ్యక్తిగత రుణాన్ని పొందే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు విధించకుండా నిరోధించవచ్చు. తద్వారా ఈఎంఐ భారం తగ్గుతుంది. అలాగే త్వరగా రుణ చెల్లింపును సులభతరం చేస్తుంది. అయితే సమకాలీన కాలంలో పర్సనల్ లోన్‌ను సెక్యూర్ చేయడం సౌకర్యంగా మారింది. బ్యాంకుల్లో నిరీక్షించే రోజులు పోయాయి. ఇప్పుడు, మీ మొబైల్ ద్వారా దరఖాస్తు చేసి, అవసరమైన పత్రాలను సమర్పించి, క్షణాల్లో మీ ఖాతాలో నిధులను ఇచ్చే స్థాయికు బ్యాంకింగ్‌ రంగం చేరుకుంది. పర్సనల్ లోన్ తీసుకునే ముందు అవసరమైన ప్రశ్నలను అడగడం ద్వారా స్వీయ-అంచనా చేసుకోండి. మంచి సమాచారంతో కూడిన నిర్ణయాన్ని నిర్ధారించుకోవడానికి సంతృప్తికరమైన సమాధానాలను పొందిన తర్వాత మాత్రమే బ్యాంకుకు వెళ్లండి.

స్థిరమైన ఆదాయం
వ్యక్తిగత రుణం పొందడానికి స్థిరమైన ఆదాయ వనరు కీలకం. సాధారణంగా, వ్యక్తిగత రుణాన్ని ఆమోదించడానికి పని చేసే వ్యక్తులకు బ్యాంకులకు నెలవారీ జీతం కనీసం రూ. 30,000 అవసరం. అయినప్పటికీ రిటైర్డ్ వ్యక్తులు తరచుగా సవాళ్లను ఎదుర్కొంటారు. ఎందుకంటే వారికి వ్యక్తిగత రుణాలను అందించడానికి బ్యాంకులు ఇష్టపడవు.
అవసరం

వ్యక్తిగత రుణాన్ని పొందే ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రశ్నించడం చాలా అవసరం. రుణానికి సంబంధించి నిజమైన ఆవశ్యకతను అంచనా వేయాలి. అది మీ అవసరాలను నిజంగా నెరవేరుస్తుందో? లేదో? లోన్‌ను ఎంచుకునే ముందు స్నేహితులు లేదా బంధువుల నుంచి రుణం తీసుకోవడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం కాదా? అని ఆలోచించాలి.

అవసరాన్ని అంచనా వేయడం

పర్సనల్ లోన్ కోసం ఎంచుకోవడం అనేది ఒక కొత్త ఒప్పందానికి కట్టుబడి ఉండటం వల్ల మీకు నిజంగా అవసరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. రుణదాతను కోరే ముందు అవసరమైన కచ్చితమైన మొత్తాన్ని లెక్కించాలి. అవసరమైన నిధులను నిర్ణయించడానికి, తదనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

పదవీకాలం

పర్సనల్ లోన్ గురించి ఆలోచించేటప్పుడు లోన్ కాలవ్యవధిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా 12 నుండి 60 నెలల వరకు, కొన్ని సంస్థలు పరిధిని 6 నుండి 96 నెలల వరకు పొడిగిస్తాయి. సముచితమైన పదవీకాలాన్ని ఎంచుకోవడం మీ ఆర్థిక అవసరాలు, తిరిగి చెల్లించే సామర్థ్యంతో సమలేఖనం అవుతుంది. స్వల్పకాలిక రుణాలు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉన్నప్పటికీ దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకోవడం ఈఎంఐ భారాన్ని తగ్గిస్తుంది.

అవసరమైన పత్రాలు

త్వరితగతిన పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. సాధారణంగా, అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, రెండేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్‌) వంటి ఐడీ రుజువులను కలిగి ఉంటాయి. ఈ పత్రాలను సత్వరమే సమర్పించడం ద్వారా రుణదాత నుంచి త్వరిత రుణ పంపిణీని సులభతరం చేస్తుంది.

22న అయోధ్యకు వెళ్లలేకపోతున్నారా.. ప్రసాదం కావాలనుకుంటున్నారా.. ఇలా చేయండి

రామ మందిర ప్రారంభోత్సవం దగ్గరపడుతుండడంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రామభక్తులు అయోధ్య చేరుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా కొంతమంది ఆ సమయానికి అక్కడికి చేరుకోలేరు. అలాగే స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించలేరు. అలాంటి వారి కోసమే ఖాదీ ఆర్గానిక్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

రామ్ లల్లా ప్రసాదాన్ని మీ ఇంటికి డెలివరీ చేసేందుకు కసరత్తు చేసింది. దీనికోసం మీరు ఇంట్లో కూర్చొని ఈ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ప్రసాద్‌ని ఆర్డర్ చేయాలి. అలా చేస్తే ఎలాంటి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రసాదం మీ ముంగిట్లోకి వచ్చేస్తుంది. మరి ప్రసాదాన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాదీ ఆర్గానిక్..

రామ్ లల్లా ప్రసాదం కోసం మీరు Google కి వెళ్లి KHADI ORGANIC అని టైప్ చేయాలి. అప్పుడు మీకు ఖాదీ ఆర్గానిక్ వెబ్‌సైట్‌ కనిపిస్తుంది. తర్వాత మెనూలో ఫ్రీ ప్రసాద్ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి యాడ్ టు కార్ట్ అండ్ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత బై నౌ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీరు దాని ప్రాసెసింగ్ కోసం కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ పూర్తి చిరునామాను పూరించి సబ్మిట్ కొట్టండి.

డెలివరీలో ఆలస్యం కావచ్చు

పైన పేర్కొన్నట్లుగా, మీ ఆర్డర్ ధృవీకరించబడటానికి సమయం పడుతుంది. ఈ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం, మీరు మీ ఆర్డర్‌ను ధృవీకరించిన తర్వాత జనవరి 22 తర్వాత మాత్రమే ట్రాక్ చేయగలరు. ఈ వెబ్‌సైట్ లో మీరు ఒక ప్రసాదం బాక్స్‌ను మాత్రమే ఉచితంగా డెలివరీ పొందగలరు. ఆర్డర్ చేసిన తర్వాత మీకు ఎలాంటి నిర్ధారణ సందేశం లేదా ఎలాంటి అప్‌డేట్ రాకుంటే, మీరు వారి సంప్రదింపు నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి లావాదేవీలు చేయనవసరం లేదని గుర్తుంచుకోండి.

సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం’ షో క్యాన్సిల్?.. కారణం అదే.. వైరల్ అవుతున్న ఫోటో

 

ఈ సంక్రాంతి పండుగ వేళ ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో గట్టి పోటీ నెలకొంది. ఈసారి పండుగ బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హనుమాన్’, నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘సైంధవ్’ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.
నేడు ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’​ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో యంగ్ హీరో తేజ సజ్జా పోటీ పడ్డారు. ఈ రెండు సినిమాలలో హనుమాన్ సినిమాదే పై చేయి అంటున్నారు. అంతే కాకుండా మహేష్ బాబు సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం’ షో క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఫోటో కూడా వైరల్ అవుతుంది.

మహేష్ బాబు సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం’ షో క్యాన్సిల్?

‘హనుమాన్’ స్పీడ్ పెరగడంతో ‘గుంటూరు కారం’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మహేష్ సొంత మల్టీఫ్లెక్స్ AMB సినిమాస్‌(గచ్చిబౌలి)లో మొదటిరోజే ‘గుంటూరు కారం’ సినిమా క్యాన్సిల్ అయ్యింది. కొత్తగా యాడ్ చేసిన 1 PM స్లాట్ కు బుకింగ్స్ లేకపోవడంతో షో క్యాన్సిల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సొంత మల్టీప్లెక్స్‌ లో పెద్ద దెబ్బ తగిలిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దీని గురించి మల్టిఫ్లెక్స్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ‘గుంటూరు కారం’ జోరు తగ్గడంతో, హనుమాన్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 1 గంటకు కూడా స్లాట్స్ యాడ్ చేశారని తెలుస్తోంది.

చెప్పినట్లుగానే చేసిన హనుమాన్ టీమ్, టికెట్ కలెక్షన్లలో అయోధ్యకు విరాళంగా ఎంతిచ్చారంటే!


ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా మన పురాణాల్లోని హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో కథగా తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’ వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అమృత అయ్యర్, గెటప్ శీను, వెన్నెల కిషోర్, సత్య, వినయ్ రాయ్.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. నేడు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజవ్వగా ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయం సాధించింది. హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) విరాళం ఇస్తాము అని అన్నారు. దీంతో చిత్రయూనిట్ కి దేశవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. ఇక హనుమాన్ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందే దేశమంతటా నిన్న సాయంత్రం నుంచే ఆల్మోస్ట్ 1000 ప్రీమియర్స్ వేయగా దాదాపు అన్ని బుకింగ్స్ అయిపోయాయి. నిన్నే చాలా కలెక్షన్స్ వచ్చాయని సమాచారం.
దేశమంతటా హనుమాన్ సక్సెస్ వినిపిస్తుండటంతో తాజాగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న ప్రీమియర్స్ కి చాలా బాగా టికెట్స్ సేల్ అయ్యాయి. దాదాపు 2 లక్షల 85 వేల టికెట్స్ వరకు అమ్ముడుపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని టికెట్స్ నుంచి 5 రూపాయల చొప్పున అంటే ఆల్మోస్ట్ రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిరానికి చెక్ రూపంలో అందచేస్తాం అని తెలిపారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు. అలాగే హనుమాన్ సినిమా థియేటర్స్ లో నడిచినన్ని రోజులు ప్రతి టికెట్ పై 5 రూపాయలు అయోధ్యకు ఇస్తామని మరోసారి తెలిపారు.
ఇక హనుమాన్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. హనుమాన్ శక్తులు ఒక మనిషికి వస్తే ఏమవుతుంది అనే కథతో తేజ సజ్జని సూపర్ హీరోగా చూపించి, చివర్లో హనుమంతుడిని రప్పించి భారీ హిట్ కొట్టారు. చివరి అరగంట అయితే ప్రేక్షకులు స్క్రీన్ నుంచి తల కూడా తిప్పకుండా చూస్తున్నారు. అందరూ జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ థియేటర్స్ నుంచి ఒక మంచి అనుభూతితో వెళ్తున్నారు.

Lakshadweep: లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ మరిన్ని విమానాలు..మూన్నేళ్ల వరకు నో టిక్కెట్స్!

Lakshadweep: లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ మరిన్ని విమానాలు..మూన్నేళ్ల వరకు నో టిక్కెట్స్!

ప్రధాని మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌(Lakshadweep)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అనేక మంది పర్యాటక ప్రేమికులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ విమాన సంస్థ ప్రయాణాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థగా నిలించింది. అంతేకాదు తాజాగా లక్షద్వీప్‌ను సందర్శించాలనుకునే ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో మరిన్ని అదనపు విమానాలను కూడా మొదలుపెట్టింది. ఈ తరుణంలో తాజాగా కొచ్చి అగట్టి కొచ్చికి అదనపు విమానాలను ప్రారంభించింది. వారానికి రెండు రోజులు అంటే ఆది, బుధవారాల్లో అదనపు విమానాలు నడుస్తాయని అలయన్స్ ఎయిర్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

లక్షద్వీప్‌లో కొచ్చి, కేరళలోని అగట్టి ద్వీపం మధ్య ప్రయాణిస్తున్న ఏకైక విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్(Alliance Air). లక్షద్వీప్‌లో ప్రాంతీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానయాన సంస్థ ప్రతిరోజూ 70 సీట్ల విమానాలను ద్వీపానికి నడుపుతోంది. ఇది ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తోందని మార్చి వరకు అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో టిక్కెట్ల గురించి తమను చాలా మంది ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. టిక్కెట్ల కోసం విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో అదనపు విమానాలు ప్రారంభించినట్లు చెప్పారు. అవసరమైతే ఫ్లైట్ ఫ్రీక్వెన్సీని పెంచుతామని కూడా వెల్లడించారు.

Health

సినిమా