Equity Funds: ఆ పథకాల్లో పెట్టుబడితో మీరే కింగ్‌లు.. మ్యూచువల్ ఫండ్స్‌లో టాప్ 5 ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఇవే..!

ఇటీవల కాలంలో ఎస్ఐపీ మ్యూచువల్ ఫండ్స్ నిరంతర వృద్ధిని సాధిస్తున్నాయి. ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం ఏప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు రూ. 20,371 కోట్ల ఇన్‌ఫ్లోలను నమోదు చేశాయి. ఇది రూ. 15,000 కోట్లకు పైగా ఇన్‌ఫ్లోలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత సంవత్సరంలో అత్యధిక రాబడిని అందించిన టాప్-5 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తెలుసుకుందాం.


ఎస్‌బీఐ పీఎస్‌యూ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో ఈ ఫండ్ 99.50 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్ రూ. 34.50గా ఉంది. ఫండ్ పరిమాణం రూ. 2,352.22 కోట్లుగా ఉంది. పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ. 500తో తమ ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో ఫండ్ 96.2 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్ రూ. 36.94గా ఉంది. ఫండ్ పరిమాణం రూ.4,115.15 కోట్లు. పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్‌లో నెలకు కేవలం రూ. 100తో తమ ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.
రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఇలా..
Image
ముద్ర రుణంతో మారిన తలరాత.. వన్ షాట్‌తో లక్షాధికారి..
ఇన్వెస్కో ఇండియా పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
ఈ థీమాటిక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో, ఫండ్ 94.3 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్ రూ. 72.56గా ఉంది. ఫండ్ పరిమాణం రూ. 956.83 కోట్లుగా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీున నెలకు రూ. 500తో ప్రారంభించవచ్చు.

నిప్పాన్ ఇండియా పవర్ & ఇన్‌ఫ్రా ఫండ్ డైరెక్ట్ గ్రోత్
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో ఈ ఫండ్ 82 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్ రూ. 366.73గా ఉంది. ఫండ్ పరిమాణం రూ. 5,043.02 కోట్లుగా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిదారులు నెలకు కేవలం రూ. 100తో తమ ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.

క్వాంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ‘వెరీ హై రిస్క్’ రేటింగ్‌తో వస్తుంది. మే 2023, మే 2024 మధ్య గడిచిన ఒక సంవత్సరంలో ఈ ఫండ్ 80.6 శాతం రాబడిని ఇచ్చింది. దీని ప్రస్తుత నికర ఆస్తి విలువ యూనిట్‌కు రూ. 44.07గా ఉంది. ఫండ్ పరిమాణం రూ. 3,187.60 కోట్లుగా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీని నెలకు రూ. 1,000తో ప్రారంభించవచ్చు.