ఏప్రిల్ 22న లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో ఒకటి రెండు సార్లు మాత్రమే పసిడి ధర స్వలంగా పెరిగింది. ఓవరాల్గా ఈ నెల రోజుల్లోనే 7 వేల రూపాయల రేటు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. బంగారం ధర భారీగా తగ్గింది.
గత నెల తులం బంగారం లక్షదాటేసింది. అయితే చూస్తుండగానే బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. స్టాక్మార్కెట్ల జోరుతో దిగివవస్తోంది బంగారం ధర. ఆల్టైమ్ హై నుంచి దాదాపు 7వేల రూపాయల మేర పసిడి ధర తగ్గింది. ఏప్రిల్ 22న లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో ఒకటి రెండు సార్లు మాత్రమే పసిడి ధర స్వలంగా పెరిగింది. ఓవరాల్గా ఈ నెల రోజుల్లోనే 7 వేల రూపాయల రేటు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. బంగారం ధర భారీగా తగ్గింది. మంగళవారం తులం బంగారంపై రూ.500 మేర ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం పదిగ్రాములపై రూ.450, 24 క్యారెట్లపై రూ.490 మేర ధర తగ్గింది. వెండి కిలోపై రూ.1000 మేర ధర తగ్గింది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,250, 24 క్యారెట్ల ధర రూ.95,170 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్ల ధర రూ.95,020 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్ల రేటు రూ.95,020 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్ల ధర రూ.95,020 గా ఉంది.