JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జేఈఈ మెయిన్ లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్ డ్ (JEE Advanced 2024 ) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించ నున్నారు. షెడ్యూల్ ప్రకారం JEE Advanced 2024 దరఖాస్తు ప్రక్రియ శనివారం (ఏప్రిల్27) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అయింది. మే17నుంచి 26 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీ క్షలు నిర్వహించనున్నారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఫలితాలను జూన్ 9, 2024న విడుదల చేస్తారు.

దరఖాస్తు విధానం, ఫీజు

ఈ ఏడాది అన్ని కేటగిరీలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 దరఖాస్తు ఫీజును అధికారులు పెంచారు.ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు రూ.1600, ఇతర అభ్యర్థులందరూ రూ. 3200 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేయాలి

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://jeeadv.ac.in/ సందర్శించాలి.
అందులో రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇచ్చిన ఫామ్ లో మీ వివరాలను నమోదు చేయాలి
తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీ అప్లికేషన్ సమర్పించాలి.
తదుపరి అవసరా లకోసం అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *