Mahindra Thar Earth Edition: మహేంద్ర థార్ ఎర్త్ ఎడిషన్ వచ్చేసింది. ధర, ఫీచర్స్ ఇవే!

Mahindra Thar Earth Edition : ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చాలా రకాల వాహనాలు లాంచ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే రిలీజ్ చేస్తున్నాయి.Mahindra Thar Earth Edition


Mahindra Thar Earth Edition launched at Rs 15.4 lakh

ఇలాంటి నేపథ్యంలో మహేంద్ర కంపెనీ అదిరిపోయే కారును మార్కెట్లోకి ఆవిష్కరించింది. మహేంద్ర కంపెనీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేంద్ర కంపెనీ బ్రాండ్ కు మారుపేరు. దృడానికి సంకేతం. మహేంద్ర కంపెనీకి చెందిన ప్రతి ఒక్క కారు… ఏనుగు కంటే బలంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. చాలామంది మహీంద్రా కంపెనీకి చెందిన కార్లు వాడతారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీఐపీలు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మహేంద్ర కంపెనీ కార్లు మాత్రమే వాడుతారు.Mahindra Thar Earth ఎడిషన్
తాజాగా మహేంద్ర కంపెనీ థార్ ఎర్త్ ఎడిషన్ కారును ఆవిష్కరించింది. ఈ కారును కొత్త ఫీచర్లు అలాగే ప్రీమియం డిజైన్తో రిలీజ్ చేసింది కంపెనీ. ముఖ్యంగా పెట్రోల్ అలాగే డీజిల్ ఇంజన్లతో కావాల్సిన పార్ట్శ్ సిరీస్ తో ఈ కారును మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇక దీని ప్రారంభ ధర 15.40 లక్షలు గా డిసైడ్ చేశారు. ఎక్స్ షోరూం ప్రకారం ఈ ధరను నిర్ణయించింది కంపెనీ.

అలాగే ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ధర వచ్చేసి 15.40 లక్షలు గా ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెరియంట్ 16.99 లక్షలు గా ఉంది. డీజిల్ ఎంటీ ధర వచ్చేసి 16.15 లక్షలు గా నిర్ణయించారు. అలాగే ఏటి ధర 17.40 లక్షలు గా డిసైడ్ చేసింది కంపెనీ. కస్టమర్లు మరిన్ని యాక్సిస్ సిరీస్ లను ఎంపిక చేసుకోవచ్చని వాటి ఆధారంగా ధర కూడా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.