సగ్గు బియ్యంతో మధుమేహాన్ని నియంత్రించండి

సగ్గు బియ్యం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడంటే పెద్దగా వీటిని ఎవరూ తినడం లేదు. ఇంతకు ముందు వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. కేవలం పాయసంలోనే కాకుండా..


సగ్గు బియ్యంతో ఎన్నో రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు.

సగ్గు బియ్యంలో ఏముందిలే అని అనుకుంటే పొరపాటే. సగ్గుబియ్యం తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. శరీర ఆరోగ్యాన్ని రక్షణగా నిలుస్తాయి.

డయాబెటీస్‌తో బాధ పడేవారు ప్రతి రోజూ కొద్ది మోతాదులో సగ్గుబియ్యం తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తిన్నా త్వరగా కడుపు నిండుతుంది. కాబట్టి ప్రతిరోజూ తిన్నా మంచిదే.

అదే విధంగా గర్భిణీలు కూడా ప్రతిరోజూ సగ్గు బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బిడ్డకు ఎంతో మేలు చేస్తుంది. సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉంటాయి. ఇవి కడుపులో బిడ్డకు చాలా అవసరం. తక్షణమే ఎనర్జీ లభిస్తుంది.

సగ్గుబియ్యంలో ఐరన్, విటమిన్ కె, క్యాల్షియం కూడా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఎముకలు, కండరాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఎముకలు బలంగా ఉండేందుకు, సమస్యలు దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది. బరువు, రక్త పోటు అదుపులో ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)