Congress Party: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

www.mannamweb.com


Brs Mlc’s Join in Congress Party: తెలంగాణలో సంచలన రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజ్ సారయ్య ఉన్నారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు పెరిగింది. మొత్తం మండలిలో సభ్యుల సంఖ్య 40 ఉండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

వరుస పరాజయాలతో చతికిలపడిన బీఆర్ఎస్ పార్టీకి మనోధైర్యం నింపడానికి ఒకవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తుండగా..మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా, ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేరోజు కాంగ్రెస్ గూటికి చేరడం బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ కొట్టినట్లు అయింది.