Rental Rooms in Tirumala : తిరుమల కొండపై వెలసిన వేంకటేశ్వర స్వామి దర్శనానికి సాధారణ రోజుల్లోనే భక్తులు పోటెత్తుతారు. అలాంటిది ఇక సెలవు దినాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. భక్తజనంతో తిరుమల గిరులు కిక్కిరిసిపోతాయి. ఇప్పుడు వేసవి సెలవులు రావడంతో.. కొండపై ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో లాకర్లు మొదలు.. అద్దె గదుల వరకు అన్నీ నిండిపోతాయి. ఫలితంగా.. అత్యవసరమైన వారు రూములు లభించక అవస్థలు పడుతుంటారు.
అందుకే.. చాలా మంది ముందుగానే ఆన్లైన్లో దర్శన టికెట్లు, అద్దె గదులు బుక్ చేసుకొని వెళ్తుంటారు. నెల రోజులు ముందుగానే టీటీడీ రూమ్ల బుకింగ్ ఓపెన్ చేస్తుంది. అయితే.. బుకింగ్ తెరిచిన కాసేపటికే గదులు మొత్తం నిండిపోతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని గదులు బ్లాక్ చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నిర్వహించిన “డయల్ యువర్ ఈవో” కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గదుల బుకింగ్ సమస్యను కూడా భక్తులు ఈవో దృష్టికి తెచ్చారు. స్పందించిన ఈవో గదులు అత్యవసరమైన వారు ఎలా బుక్ చేసుకోవచ్చో వివరించారు.
టీటీడీ పరిపాలన భవంలో ఈ శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి సమాధానాలు చెప్పారు. ఆన్లైన్ లో విడుదల చేస్తున్న టికెట్లు వెంటనే అయిపోతున్నాయని.. ఎంత ప్రయత్నించినా బఫరింగ్ అవుతోందే తప్ప టికెట్లు బుక్ కావడం లేదని.. ఇదంతా చూస్తుంటే పారదర్శకత లోపించిందేమో అనే సందేహం కలుగుతోందని ఓ భక్తుడు ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈవో.. శ్రీవారి సేవ ఆన్లైన్ అప్లికేషన్ చాలా పారదర్శకంగా ఉందన్నారు. ఎటువంటి అనుమానాలకూ చోటు లేదని చెప్పారు.
Related News
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటా...
Continue reading
ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులు సందర్శించేందుకు ఆధ్యాత్మిక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
అయితే,...
Continue reading
వేసవి సెలవులకు తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూ...
Continue reading
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. ఫిబ్రవరి 19న మే నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేస్తామని ప్రకటించింది. 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు...
Continue reading
Tirumala: శ్రీవెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati). అనేక వింతలు, విశేషాలకు ఆలవాలయం. స్వామివారిని దర్శించుకోవాలని దేశ విదేశాలనుంచి భా...
Continue reading
Tirumala - seven Hills - History Behind the seven hill names - ఏడు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే... ఏడు కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే... తిరుమలలో ఉండే ఏడు కొండలనే సప్తగిరులు అని...
Continue reading
తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి ఓ గుడ్ న్యూస్ చెప్తుంది. తాజాగా టిటిడి మరో కీలక నిర్ణయం తీసుకుంది . తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్...
Continue reading
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారు. వరుసగా మూడు రోజులు పాటు సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమ...
Continue reading
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లలోపు యువత 'గోవింద కోటి' అని పది లక్షల 116 సార్లు రాస్తే శ్రీవారి బ్రేక్దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ...
Continue reading
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్ప...
Continue reading
తిరుమల కొండపై 7,500 గదులు మాత్రమే ఉన్నాయని ఈవో చెప్పారు. ఇందులో 50 శాతం గదులు ఆన్లైన్ బుకింగ్ కోసం అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఎంతో మంది భక్తులు టికెట్ల కోసం ప్రయత్నిస్తుంటారు కాబట్టి.. వెంటనే అయిపోయే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో రూమ్స్ దొరకని భక్తులు.. తిరుమలలో సీఆర్వోలో నమోదు చేసుకోవడం ద్వారా రూమ్స్ పొందే అవకాశం ఉందని ఈవో చెప్పారు