health tips: మానసిక ఒత్తిడి భరించలేకపోతున్నారా? అయితే లోపం ఇదే!!

ప్రస్తుత కాలంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మానసిక ఒత్తిడి.. స్ట్రెస్.. ఇది ఇప్పుడు చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తీవ్రసమస్యగా పరిణమిస్తోంది.
అయితే ఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయి. మన శక్తి కంటే ఎక్కువగా పనిచేయడం, సరైన నిద్ర లేకపోవడం, సమస్యలను పరిష్కరించడంలో మెదడుపై పడుతున్న భారం వంటి అనేక కారణాలు ఒత్తిడికి కారణంగా తెలుస్తున్నప్పటికి ఒత్తిడికి చాలా ముఖ్యమైన కారణం మరొకటి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఒత్తిడికి శరీరంలో విటమిన్ లోపం కూడా ఒక కారణమని, శరీరంలో విటమిన్ లోపం ఉంటే అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ల లోపం ఒత్తిడి మరియు ఆందోళన సమస్యను మరింత ఎక్కువ చేస్తుందని, విటమిన్లు సమృద్ధిగా ఉంటే ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.

 

Related News

మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలని చెబుతున్నారు. అయితే మన శరీరంలో ఏ విటమిన్ లోపం వల్ల ఒత్తిడి వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ డి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ లోపం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఎముకల్లో కూడా బలహీనత ఏర్పడుతుంది. దీనివల్లనే ఒత్తిడి మరియు మానసిక ఆందోళన సమస్య కలుగుతుంది.

కాబట్టి విటమిన్ డి లోపం ఉన్నవాళ్లు ఒత్తిడి మరియు ఆందోళన నుంచి బయటపడడానికి ప్రతిరోజు కొంత సమయం సూర్యకాంతిలో గడపాలి. ముఖ్యంగా సూర్యోదయంలో వచ్చే సూర్యకిరణాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అది మన శరీరాన్ని కాపాడుతుంది. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

విటమిన్ డి తృణధాన్యాలలో సమృద్ధిగా ఉంటుంది. పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులలోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో చేపలను భాగం చేసుకుంటే కూడా మనకు విటమిన్ డి లభిస్తుంది.ఇక ఆకుపచ్చని ఆకుకూరలలో కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని Mannam Web ధ్రువీకరించలేదు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *