దేవుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోకూడదు. ఎందుకంటే.?

దేవుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోకూడదు. ఎందుకంటే.?
హిందూ సంప్రదాయం ప్రకారం రోజు దేవుడికి పూజ చేసి హారతి ఇస్తూ ఉంటారు. ఇళ్లల్లో, దేవాలయాల్లో కూడా హారతి తప్పనిసరి. నిత్య పూజల్లో, ప్రత్యేక పూజల్లో కూడా హారతిని ఇవ్వడం ఒక పద్దతి. ఇది నిన్నో మొన్నో వచ్చినది కాదు. ఎప్పటి నుండో ఈ పద్దతిని మనం పాటిస్తూనే ఉన్నాం. అలా హారతి ఇచ్చి గంట కొడతారు. ఇది అందరికీ తెలిసినదే. దీనిలో ఏమి చెప్పాల్సిన సంగతి లేదు. కానీ చాల మందికి తెలియనిది ఏమిటంటే..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

హారతిని కళ్లకు అద్దుకోకూడదట. అవును ఇది నిజం. దీనికి గల కారణాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడే పూర్తిగా చదివి కారణాలు తెలుసుకోండి. మామూలుగా పూజ చేసి పూజ ఆఖరి లో కర్పూరం తో లేదా ఏదైనా దీపం తో హారతి ఇస్తారు. అయితే దేవుడికి పూజ చేసి ఆఖరిని దిష్టి తీయడానికి హారతి ఇస్తారు అని అంటున్నారు పండితులు.
అయితే హారతి మనకి శుభాలు కలగడానికి కాదని అందుకే అద్దుకోకూడదు అని పండితులు అంటున్నారు. హారతిని రెండు చేతుల తో దండం పెట్టుకోవచ్చు కావాలంటే. అలానే చాల మంది తీర్ధం తీసుకుని ఆ చేతులని తలకి రాసుకుంటారు. అలా కూడా తల కి రాసుకోకూడట. కనుక ఎప్పుడు ఇలా చెయ్యకండి.

Related News