ఈ రోజుల్లో పిల్లలకు పాఠాలు నేర్పడం చాలా కష్టమవుతోంది. మొబైల్ ఫోన్ అడిక్షన్, టీవీ అడిక్షన్ ఎక్కువుతుండటంతో స్కూళ్లలో చాలా మంది విద్యార్థులు కుదురుగా కూర్చొని పాఠాలు వినడం లేదు. ముఖ్యంగా దిగువ తరగతి విద్యార్థుల్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే కొన్ని స్కూళ్లలో పిల్లలకు చదువును సంప్రదాయ రీతిలో కాకుండా కాస్త వెరైటీగా బోధిస్తున్నారు. ఆటపాటల రూపంలో పాఠాలు చెబుతూ వాళ్లను క్లాస్రూమ్లో ఎంగేజ్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నారు. దీని వల్ల అనేక చోట్ల సత్ఫలితాలు కూడా వచ్చాయి. అయితే పిల్లల్ని క్లాస్రూమ్కు మరింత అలవాటు చేసేందుకు ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోకమానరు.
ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటారనేది తెలిసిందే. సర్కారు బడుల్లో పిల్లల అటెండెన్స్ కూడా తక్కువే. దీన్ని నివారించేందు ఓ స్కూలు యాజమాన్యం వినూత్న ప్రయోగానికి తెరలేపింది. ఉత్తర్ ప్రదేశ్, కన్హౌజ్లోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ క్లాస్రూమ్స్ను ఏకంగా స్విమ్మింగ్ పూల్స్గా మార్చేసింది. దీని వెనుక ఓ కారణం ఉంది. కన్హౌజ్ స్కూల్లో చదివే వారిలో ఎక్కువ మంది విద్యార్థుల పేరెంట్స్ శ్రామికులు, పేద రైతులు కావడం గమనార్హం. పంట కోతల వల్ల అన్నదాతల పిల్లలు స్కూళ్లకు డుమ్మా కొడుతున్నారు. అలాగే వడగాల్పుల వల్ల కూడా స్కూల్ అటెండెన్స్ అమాంతం పడిపోయింది.
పిల్లలు రాక స్కూలు బోసిపోయింది. దీంతో పాఠశాల యాజమాన్యం వినూత్న ప్రయోగానికి తెరలేపింది. క్లాస్రూమ్స్ను స్విమ్మింగ్ పూల్స్గా మార్చేసింది. తరగతి గదుల నిండా నీళ్లు నింపేసింది. అందులో వాళ్లకు పాఠాలు చెబుతూనే మధ్యలో వాటర్ గేమ్స్, స్విమ్మింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో విద్యార్థులు స్కూళ్లకు క్యూ కట్టారు. రోజు పాఠశాలకు వెళ్తూ చదువుకోవడమే గాక తోటి విద్యార్థులతో కలసి క్లాస్రూమ్లో ఆడుకుంటున్నారు. స్కూలు యాజమాన్యం ఆలోచనను చాలా మంది మెచ్చుకుంటున్నారు.
https://x.com/IndianTechGuide/status/1785533428412420162
Related News
ఇప్పటి వరకు ప్రపంచంలో గణితశాస్త్రానికి సంబంధించి చాలా అరుదైన ఆవిష్కరణలు జరిగాయి. ప్రఖ్యాత మ్యాథమెటీషియన్లు కొన్ని సంఖ్యల ప్రత్యేకతను వివరించారు.
వీటికి ఆ గణిత శాస్త్రవేత్తల పేర్...
Continue reading
దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో ప్రేమ జంటల రొమాన్స్ తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. అయితే ఈ సారి మెట్రోలో కాకుండా ఏకంగా పబ్లిక్ రవాణ...
Continue reading
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
Continue reading
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియో...
Continue reading
ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది కేవలం యూట్యూబ్ వంటి వాటిని కెరీర్ గా మలుచుకుని కళ్లు చెదిరే మొత్తాలు రాబడుతున్నారు.
మీరు ఆకట...
Continue reading
Boy who applies tilak in ayodhya ram lalla mandir revealing his daily earnings: వందల ఏళ్ల నాటి కల రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. దేశ ప్రధాని ...
Continue reading
కాలం మారుతూ వస్తుంది.. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు పెరగడం సహజం. అయితే, ఒక్కప్పుడు ఉండే ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్...
Continue reading
Lok Sabha Election 2024: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద...
Continue reading
ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి కొన్ని ఘటనల వెనక మిస్టరీ గానీ, లాజిక్ గానీ తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే ...
Continue reading
ఎవరైనా ఒకరిని ప్రేమించినప్పుడు, సరైనా ఎత్తు ఉందా, ఆస్తి ఉందా, ఉంటే ఎంతుంది.. అనేవి చూడరు.. అవన్ని సెకండరీ అవుతాయి. సభ్యసమాజం ఎంత నిరసన వ్యక్తం చేసినా ప్రేమలో ఉన్న జంటను కలవకుండా అడ...
Continue reading
ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఉండే గీరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తరుచు ఉరుకులు పరుగుల జీవితంలో బతుకున్న వారికి బయట షాప్ లకు వెళ్లి షాపింగ్ చేసే త...
Continue reading
ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, పెళ్లి చేసుకునేందుకు యువతులు అంత తొందరగా ఓకే చెప్పకపోవడం, చదువు, కెరియర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం.. వంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్లకు దూరంగ...
Continue reading