శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్లు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పట్ట పగలు గ్రామాల్లోకి చొరపడుతూ స్వైర విహారం చేస్తున్నాయి.
బుధవారం మధ్యాహ్నం వజ్రపు కొత్తూరు మండలం కొండపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. క్లాసులు జరుగుతుండగా ఓ ఎలుగుబంటి పాఠశాల ఆవరణలోకి చొరబడి తీవ్ర భయాందోళనలను సృష్టించింది. కాసేపు పాఠశాల గ్రౌండ్లో కలియ తిరుగుతూ బాత్రూమ్ పక్క నుంచి కొండపైకి వెళ్ళిపోయింది ఎలుగు బంటి. ఎలుగుబంటిని దగ్గరగా చూసిన విద్యార్థులు, ఉపాద్యాయులు హడలిపోయారు. తలుపులు వేసుకొని కొద్దిసేపటి వరకు విద్యార్థులు, ఉపాద్యాయులు తరగతి గదుల్లోనే బిక్కు బిక్కుమంటూ మగ్గిపోయారు.
అయితే ఆ సమయంలో విద్యార్థులు ఎవరు ఎలుగుబంటికి ఎదురు కాకపోవటం.. కాసేపు అవరణలో తిరగాడుతూ అది తోటలలోకి వెళ్ళిపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. పట్టపగలు స్కూల్ ఆవరణలోకి ఎలుగుబంటి రావడంతో ఉపాద్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన చెoదుతున్నారు. పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి రక్షణ కల్పించాలని గ్రామస్తులు, ఉపాద్యాయులు కోరుతున్నారు. కిందటి వారం ఇదే మండలంలోని ఎం.గడూరు, డేప్పూరు గ్రామాలలో రెండు ఎలుగుబంట్లు తిరిగాడుతూ నలుగురుపై దాడి చేయడంతో.. ఇప్పుడు ఎలుగుబంటి అంటేనే ఉద్దాన ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో పాఠశాల ఆవరణలోకే ఏకంగా ఎలుగుబంటి ప్రవేశించడంతో అందరూ ఉలిక్కి పడుతున్నారు. పైగా ఈ పాఠశాల ప్రహరీకి ఆనుకునే కొండ, దట్టమైన తోటలు ఉండటంతో ఏ క్షణాన ఏ అడవి జంతువు పాఠశాల ఆవరణలోకి ప్రవేశిస్తుందో.. ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ఇక్కడ బిక్కుబిక్కుమంటూనే చిన్నారులకు విద్యా బోధన కొనసాగిస్తున్నారు ఉపాధ్యాయులు. పాఠశాల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలంటూ గతంలో పలుసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని అయినా పట్టించుకున్న దాఖలాలు లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Related News
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల పైన ఉత్కంఠ సాగుతుంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఏపీకి కీలక సమాచారం అందింది.
రెండు తెలుగు రాష్ట్...
Continue reading
అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP)ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024)పోలింగ్ జరిగిన రోజు దగ్గరి నుంచి వరుసగా ఘ...
Continue reading
ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా సీఎం జగన్ , మంత్రి విడుదల రజనీ (Vidadala Rajini) పేరుతో ఐవీఆర్ఎస్ ఫోన్లు వచ్చాయి. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల క...
Continue reading
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియో...
Continue reading
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ.. పలు పాత స్కీమ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ చేయాల్సిన వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. అయితే,...
Continue reading
కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈ సార...
Continue reading
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాల్లో మునిగిపోయారు. గెలుపు పై ఎవరి ధీమా వారు వ్యక్త...
Continue reading
ఏపీ రాజకీయాల్లో ఈసీ నిర్ణయాలు సంచలనంగా మారాయి. మే 13న ఎన్నికలు జరగనుండటంతో ఓటింగ్ ప్రక్రియ నిర్వహణను ముమ్మరం చేసింది. అటు ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రధానంగా నేతల ప...
Continue reading
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర...
Continue reading
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. సినీ హీరో సాయి ధరమ్తేజ్ కాన్వాయ్ ముందుకు వెళుతున్న తరుణంలో గుర్తుతెల...
Continue reading
AP Pensions: ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.. అయితే, గత ...
Continue reading
ఆసరా పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన ప్రకటన చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మే 1వ తేదీ నుండి 5 తేదీ వరకు పెన్షన్లు జమ చేస్తామని వెల్లడించింది.
కాగా, ఎలక్షన్ కోడ్ ...
Continue reading